Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కె.గోవర్ధన్రావు దర్శకత్వంలో వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై హేమలతారెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'నిన్నే చూస్తు'. శ్రీకాంత్, నితిన్, హేమలతా (బుజ్జి) హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాత హేమలతారెడ్డి మాట్లాడుతూ, 'ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. సంగీత దర్శకుడు రమణ్ రాథోడ్ అద్భుతమైన పాటలను అందించారు. సినిమాకు టైటిల్ సాంగ్ 'నిన్నే చూస్తు' హైలైట్గా నిలుస్తుంది. ఈ పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది. ఇలాంటి అందమైన పాటకు మలేషియాలోని అందమైన లొకేషన్లు ఊపిరి పోశాయి. పాట అద్భుతంగా వచ్చింది.
నృత్య దర్శకురాలు రేఖ అందించిన కొరియోగ్రఫీ మరో హైలైట్. మంచి కుటుంబ కథా
చిత్రంగా సినిమాను తెరకెక్కిస్తున్నాం. సుహాసిని, సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రల్లో ఆకట్టుకుంటారు. వారితో కలిసి నటించడం మా అదృష్టంగా భావిస్తున్నాం.
ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుగుతోంది. దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది' అని చెప్పారు. కాశీ విశ్వనాథ్, షియాజీ షిండే, రజిత, విద్య లతా, నిహాల్, వేణు, ఫణి, రమణ్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: ప్రసాద్ ఈదర (శంకర్ కుమార్), ఎడిటింగ్: నాగిరెడ్డి.వి.