Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''బాహుబలి'తో ప్రభాస్ తానేంటో నిరూపించు కున్నారు. ఇక ఇప్పుడు నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది' అని అంటోంది పూజా హెగ్డే. ఇటీవల భారీ ఆఫర్స్ను దక్కించుకుంటూ దూసుకుపోతున్న కథానాయిక ఎవరైనా ఉన్నారంటే అది పూజానే. ఎన్టీఆర్, మహేష్బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన కథానాయికగా నటించే ఛాన్స్లను ఒకేసారి అందుకుంది. దీంతో ఒక్కసారిగా స్టార్ రేంజ్ హీరోయిన్గా మారిపోయింది. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే ప్రభాస్ గురించి స్పందిస్తూ, 'బాహుబలి'తో వరల్డ్ వైడ్గా ప్రశంసలందుకున్న ప్రభాస్తో నటించే ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదొక గొప్ప అవకాశం. రొమాంటిక్ ఎంటర్ టైనర్గా ప్రభాస్తో కలిసి నటించే చిత్రం ఉండబోతుంది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆతృతగా వెయిట్ చేస్తున్నా. 'బాహుబలి'తో ప్రభాస్ నిరూపించుకున్నారు. ఇప్పుడు నా వంతు వచ్చింది' అని తెలిపింది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నెక్ట్స్ ఓ సినిమా చేయనున్నారు. గోపీకృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణంరాజు నిర్మించే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైన విషయం విదితమే. ఈ సినిమా జూలైలో ప్రారంభం కానుంది.