Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారి రూపొందిస్తున్న చిత్రం 'బృందావనమది అందరిది'. జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ వంగల, ప్రభాకర్రెడ్డి కూతురు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రిచా పణరు, హర్షవర్ధన్, లగడపాటి విక్రమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా సాంపిల్ టీజర్ వీడియోను విడుదల చేశారు. దర్శకుడు శ్రీధర్ సీపాన మాట్లాడుతూ, 'వైజాగ్ సాగర తీరంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అవుట్పుట్ బాగా వచ్చింది. చిత్ర ఫస్ట్ షెడ్యూల్ మేకింగ్, సాంపిల్ వీడియో టీజర్ను ఉగాది సందర్భంగా విడుదల చేశాం. దానికి మంచి స్పందన లభిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నెక్ట్స్ షెడ్యూల్ ఏప్రిల్ 1 నుంచి బెంగుళూరులో, ఆ తర్వాత హైదరాబాద్లో చిత్రీకరించనున్నాం' అని అన్నారు.