Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్ శాస్త్రి, అజరురెడ్డి గొల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'రాజరథం'. ఈ నెల 23న సినిమా విడుదల కానున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత సతీష్ శాస్త్రి మాట్లాడుతూ, 'గతంలో మేం యూఎస్లో డిస్ట్రిబ్యూట్ చేసి ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. ఈ సినిమాను మేకింగ్ పరంగా రాజీపడకుండా నిర్మించాం. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. అజనీష్ లోక్నాథ్ మంచి నేపథ్య సంగీతాన్ని అందించారు. సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. ''రంగితరంగి' చిత్రంతో నిరూపించుకున్న దర్శకుడు నిరూప్ భండారి హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించడం ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరిన్ని కొత్త కాన్సెప్ట్ చిత్రాలొస్తాయి. పాటలకు మంచి స్పందన లభించింది' అని రామ్ కుమార్ తెలిపారు.
హీరో నిరూప్ భండారి చెబుతూ, 'సినిమా కోసం తెలుగు నేర్చుకున్నా. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇందులో నేను అభి అనే మెకానికల్ ఇంజనీర్ విద్యార్థిగా కనిపిస్తా. అడగ్గానే వాయిస్ ఓవర్ ఇచ్చిన రానాకు థ్యాంక్స్. ఆర్య ముఖ్య పాత్రలో నటించారు. సినిమా తెలుగు ఆడియెన్స్ను కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాం' అని చెప్పారు. 'ఒక మంచి సినిమాకుండాల్సిన అన్ని క్వాలిటీస్ ఇందులో ఉన్నాయి' అని హీరోయిన్ తెలిపింది.