Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగులో బయోపిక్ల జోరు ఊపందుకుంటుంది. ఇప్పటికే సావిత్రి, ఎన్టీఆర్ బయోపిక్లు తెరకెక్కుతుండగా, తాజాగా మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్రెడ్డి జీవితాన్ని తెరపైకి ఎక్కించేందుకు 'ఆనందో బ్రహ్మ' ఫేమ్ మహి వి రాఘవ్ ప్లాన్ చేస్తున్న విషయం విదితమే. వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్న ఈ చిత్రాన్ని 'యాత్ర' పేరుతో 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజరు చిల్లా, శశిదేవి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత విజరు చిల్లా మాట్లా డుతూ, ''ఆనందో బ్రహ్మ'తో మా సంస్థకు ద్వితీయ విజయాన్ని అందించిన మహి వి రాఘవ్ దర్శకత్వంలో మరో సినిమాను నిర్మించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం మహి రెడీ చేసిన లైన్ నచ్చడంతో సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందులో వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించడానికి ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఆదరించే నాయకుడు, ఎమోషన్ల్గా ప్రజలకు దగ్గరైన వ్యక్తి వైఎస్ ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా భారీ బడ్జెట్తో ఎమోషనల్ కంటెంట్గా ఈ సినిమాను నిర్మిస్తున్నాం. త్వరలోనే ఈ బయోపిక్కి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం' అని తెలిపారు.