Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా జె.బి.మురళీకృష్ణ దర్శకత్వంలో శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్లైన్ ప్రొడక్షన్స్ పతాకాలపై రవి, జో.జో.జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'జంబలకిడి పంబ'. విడుదలకు సిద్ధమవుతున్న
ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'బుధవారంతో షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే నిర్మాణాంతర పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంతో ప్రేక్షకులు మరోసారి లాఫింగ్ రైడ్ చేయనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను జూన్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. 'ఈవీవీ తెరకెక్కించిన 'జంబ లకిడిపంబ' సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదంటే అందులోని కామెడీయే కారణం. మరోసారి కడుపుబ్బా నవ్వించే కామెడీతో అదే టైటిల్తో
ఈ సినిమాను రూపొందించాం. బాడీ స్వాపింగ్ అనే కాన్సెప్ట్ వల్ల హీరోహీరోయిన్లు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారనేదే ఈసినిమా. అయితే దీని వల్ల జనరేట్ అయ్యే కామెడీ ప్రేక్షకులను ఆద్యంతం నవ్విస్తుంది. మ్యూజిక్కు మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. అందుకు తగ్గట్టు గోపీసుందర్ ఐదు అద్భుతమైన ట్యూన్స్ను అందించారు. శ్రీనివాస్రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని, వెన్నెల కిషోర్ ఇలా ప్రతీ పాత్ర చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది' అని దర్శకుడు జె.బి.మురళీకృష్ణ తెలిపారు. సత్యం రాజేష్, ధన్రాజ్, షకలక శంకర్, హరితేజ, రాజ్యలక్ష్మి, హిమజ, కేదారి శంకర్, మధుమణి, మిర్చి కిరణ్, జబర్దస్త్ అప్పారావు, సన, సంతోష్, గుండు సుదర్శన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, ఆర్ట్: రాజీవ్ నాయర్.