Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ ఓ చిత్రంలో నటిస్తున్నారు. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. మాళవిక నాయర్ కథానాయిక. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం గురించి నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ, 'రాకేష్ శశి ఒక వినూత్నమైన కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాన్ని అంతే బాగా బడ్జెట్ విషయంలో రాజీపడకుండా నిర్మిస్తున్నాం. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో కళ్యాణ్ దేవ్ డబ్బింగ్ స్టార్ట్ చేశారు. 'బాహుబలి' ఫేమ్ సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటో గ్రాఫర్గా పనిచేయడం ఓ విశేషమైతే, 'రంగస్థలం' సెట్ వేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న రామకృష్ణ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేయడం మరో విశేషం. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం ఆకట్టుకుంటుంది' అని అన్నారు. తనికెళ్ల భరణి, మురళీశర్మ, నాజర్, సత్యంరాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్, ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్.