Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, అనుష్క ముచ్చటగా మూడోసారి కలిసి నటించబోతున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి 'లక్ష్యం', 'శౌర్యం' వంటి హిట్ చిత్రాల్లో నటించి ఆన్ స్క్రీన్ మీద మ్యాజిక్ క్రియేట్ చేశారు. దీంతో ఈ జోడీకి టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఈ జోడీతో 'నా నువ్వే' ఫేమ్ దర్శకుడు జయేంద్ర ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండే ఈ చిత్రాన్ని 'నా నువ్వే' నిర్మాత కిరణ్ ముప్పవరపు నిర్మించనున్నారు. ప్రస్తుతం గోపీచంద్ 'పంతం' సినిమాలో నటిస్తున్నారు. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. జులైలో సినిమా విడుదల కానుంది. 'భాగమతి' తర్వాత అనుష్క నటించనున్న చిత్రమిది.