Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ నటి సన్నీలియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'వీరమహాదేవి'. వి.సి.వడివుడయాన్ దర్శకత్వంలో స్టివ్స్ కార్నర్ పతాకంపై ఫోన్స్ స్టీఫెన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'సన్నీలియోన్ తొలిసారి తెలుగులో నటిస్తున్న పూర్తి స్థాయి చిత్రమిది. వంద కోట్ల భారీ బడ్జెట్తో చారిత్రాత్మక చిత్రంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ వంటి ఐదు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాం. నాజర్తోపాటు వివిధ భాషల్లోని ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సన్నీలియోన్ తెలుగు కూడా నేర్చుకుంటోంది. అలాగే యుద్ధ సన్నివేశాల కొరకు సుమారు వెయ్యి గుర్రాలు, ఏనుగులు ఉన్నందున నటీనటులకు గుర్రపుస్వారిలో శిక్షణ ఇస్తున్నాం. సన్నీలియోన్ ధరించే దుస్తులు దక్షిణ భారత సంప్రదాయంలో ఉంటాయి. వీటిని ముంబయిలో తయారు చేయిస్తున్నాం. రామోజీఫిల్మ్ సిటీలో భారీ సెట్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాం. కేరళలోని అడవులలో ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో భారీ ఫైటింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నందున కెనడాలోని కంపెనీతోపాటు ఇక్కడ ఓ ప్రముఖ కంపెనీ కలిసి సీజీ వర్క్ చేస్తున్నాయి. 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్', 'గాడ్స్ ఆఫ్ ది ఈజిప్ట్' చిత్రాలకు పనిచేసిన వారు ఈ చిత్రానికి గ్రాఫిక్స్ పర్యవేక్షకులుగా పనిచేస్తుండటం విశేషం. కేవలం గ్రాఫిక్స్ కోసమే 40 కోట్లు ఖర్చుచేస్తున్నాం. భారీ స్థాయిలో ఉండే ఈ చిత్రం ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్గా నిలుస్తుంది' అని అన్నారు.