Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కిర్రాక్ పార్టీ'తో విజయాన్ని అందుకున్న నిఖిల్ తాజాగా ఓ సరికొత్త చిత్రంలో నటిస్తున్నారు. టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి పతాకంపై కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఠాగూర్ మాధు సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'నిఖిల్ సరసన కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ముప్పై శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. 'విక్రమ్వేద' ఫేం సి.ఎస్.శ్యాం సంగీతం సమకూరుస్తుండటం, సూర్యా కెమెరామెన్గా పనిచేస్తుండటం విశేషం. అన్ని అంశాల మేళవింపుగా, వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. కచ్చితంగా ఆడియెన్స్ను ఎంటర్టైన్ చేస్తుంది' అని తెలిపింది. వెన్నెల కిషోర్, పోసాని, తరుణ్ అరోరా, సత్య, నాగినీడు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: సాయి సురేష్.