Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిన్న పాత్రలకు, ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ విక్రమ్. ఆయా పాత్రల కోసం తనని తాను పూర్తిగా మలచుకోవడంలో విక్రమ్ సిద్ధహస్తుడు. అందుకు 'ఐ', 'ఇరుముగన్' వంటి చిత్రాలే తార్కాణం. నవ్యతకు, వైవిధ్యానికి పెద్దపీట వేసే విక్రమ్, దర్శకుడు హరి కాంబినేషన్లో వచ్చిన 'సామి' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా 2003లో విడుదలైన ఈ చిత్రం విక్రమ్ కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచింది. దాదాపు 15ఏండ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెన్ను రూపొందిస్తున్నారు. విక్రమ్ హీరోగా, హరి దర్శకత్వంలోనే 'సామి స్క్వెర్'గా తెరకెక్కుతున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారి మైలురాయిపై కత్తిపట్టుకుని కూర్చున్న శిలా విగ్రహం విక్రమ్గా మారడం, తన తుపాకితో కాల్చినప్పుడు బుల్లెట్ కాస్త రాకెట్లా మారి దూసుకుపోయి అగ్ని కణాన్ని ఢకొీట్టినప్పుడు చిత్ర టైటిల్ రావడం మోషన్ పోస్టర్లో హైలైట్గా నిలిచింది. ఇందులో విక్రమ్ శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మే 26న ట్రైలర్ విడుదల కానుంది. జూన్ 14న సినిమాను విడుదల చేయనున్నారు. దీంతోపాటు విక్రమ్ 'ధృవ నచ్చథిరమ్' చిత్రంలోనూ నటిస్తున్నారు.