Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్యాణ్రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నా నువ్వే'. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మహేష్ కోనేరు సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ పతాకంపై కిరణ్ ముప్పవరపు, విజరు వట్టికూటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్కి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఇప్పటి వరకు మాస్, కమర్షియల్ సినిమాలు చేసిన కళ్యాణ్రామ్ తొలిసారి సరికొత్త ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన లుక్ సైతం సరికొత్తగా ఉంటుంది. ఇటీవల రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పటికే ట్రైలర్ను 7.2 మిలియన్ ప్రేక్షకులు వీక్షించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండింగ్లో ఉంది. ఇందులో కళ్యాణ్ రామ్, తమన్నా మధ్య కెమిస్ట్రీ, సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ అందించిన అమేజింగ్ విజువల్స్, సంగీత దర్శకుడు శరత్ మెలోడీ పాటలు సినిమాకు మేజర్ అసెట్ అవుతాయి. విడుదలైన పాటలకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ రామ్, తమన్నా జోడీ హిట్ పెయిర్గా నిలవడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఈ నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పింది.