Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, సాయిపల్లవి జంటగా హనురాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచే మనసు' చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా కీలక పాత్ర కోసం హాస్యనటుడు సునీల్ను ఎంపిక చేశారు. ఆ విశేషాలను చిత్ర బృందం తెలియజేస్తూ, ''అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' వంటి సెన్సిబుల్ ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని కూడా ఓ డిఫరెంట్ క్రియేటివ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన శర్వానంద్, సాయి పల్లవిల ఫస్ట్లుక్కి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. కామెడీ హీరో సునీల్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శనివారం నుంచి ఆయన షూటింగ్లో పాల్గొంటున్నారు. శర్వానంద్, సాయిపల్లవి, సునీల్, వెన్నెల కిషోర్లపై చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, జయకృష్ణ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి' అని తెలిపింది. మురళీ శర్మ, ప్రియారామన్, కళ్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కెమెరా: జయకృష్ణ గుమ్మడి.