Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాంత్, షాలు చౌరాశియా, మమతా చౌదరి, జెబా అన్సమ్ హీరోహీరోయిన్లుగా మైనూ కె.ఎండీ దర్శకత్వంలో ఏంజెల్ ప్రొడక్షన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ పతాకంపై అలీ భారు నిర్మిస్తున్న నూతన చిత్రం 'పెళ్ళంటే..?' ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. హీరో శ్రీకాంత్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో తరుణ్ క్లాప్నివ్వగా, రైటర్ రాజేంద్రకుమార్ కెమెరా స్విచాన్ చేశారు. 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, 'చాలా రోజుల తర్వాత కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నా. నాకు పక్కాగా యాప్ట్గా నిలిచే కథ ఇది. దర్శకుడి గురించి హాస్యనటుడు అలీ చెప్పాడు. కథవినగానే బాగా నచ్చింది. మంచి వినోదాత్మక చిత్రమిది. నవరసాలుంటాయి. మైనూ చాలా సినిమాను రైటర్గా పనిచేశారు. హ్యూమర్ను బాగా తెరకెక్కిస్తే సినిమా బాగుంటుంది' అని అన్నారు. 'మైనూ మంచి విజన్ ఉన్న దర్శకుడు. రాజేంద్ర కుమార్ శ్రీకాంత్ నటించిన చాలా సినిమాలకు రైటర్గా పనిచేశారు. ఇందులో నేను హీరో ఫ్రెండ్ పాత్ర పోషించా' అని అలీ తెలిపారు. దర్శకుడు మైనూ కె.ఎండీ చెబుతూ, 'కథ ఆరంభం నుంచి ఎండింగ్ వరకు వినోదాత్మకంగా సాగుతుంది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. శ్రీకాంత్ నటించిన 'పెళ్ళిసందడి', 'పెళ్ళాం ఊరెళితే' తరహాలో సినిమా అంతా సందడి సందడిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. జూన్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు. 'మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఓ మంచి కథను తెరకెక్కిస్తున్నాం. ఆద్యంతం కామెడీగా సాగే చిత్రమిది. ఎక్కువగా భాగం బ్యాంకాక్లో సినిమా సాగుతుంది' అని నిర్మాత అలీ భారు చెప్పారు.