Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సినిమాల్లో తెలుగు కథానాయికలకు అవకాశాలు ఇవ్వడం లేదనే ఆరోపణ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. ఇటువంటి తరుణంలో ఓ తెలుగమ్మాయికి ఒక అరుదైన అవకాశం లభించింది. అది కూడా ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం రావడం విశేషం.
మనకున్న అతి తక్కువ మంది తెలుగు కథానాయికల్లో ఈషా రెబ్బా ఒకరు. 'అంతకముందు ఆ తర్వాత', 'అమీతుమీ', 'అ..!' వంటి తదితర చిత్రాలతో ఈషా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'అరవింద సమేత' (వీర రాఘవరెడ్డి ఉప శీర్షిక). శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్గా ఈషా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇప్పటికే ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న విషయం విదితమే. ఎన్టీఆర్ బర్త్డే నేపథ్యాన్ని పురస్కరించుకుని ఇటీవల విడుదల చేసిన ఫస్ట్లుక్ ఆయన అభిమానుల్నే కాదు ప్రేక్షకుల్ని సైతం అబ్బురపరిచింది. సిక్స్ప్యాక్ బాడీతో ఉన్న ఎన్టీఆర్ లుక్కి అందరూ ఫిదా అయిపోయారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి సంబంధించి మలయాళ సినిమా టైటిల్ కూడా త్వరలోనే తెలియనుంది. ప్రముఖ కేరళ పంపిణీదారుడు, ఆర్.డి. ఇల్యుమనేషన్స్ సంస్థ అధినేత ఉన్ని కృష్ణన్ ఈచిత్ర మలయాళ హక్కులను దక్కించుకున్నారు. దసరా పండుగ నేపథ్యంలో విడుదలయ్యే ఈచిత్ర మలయాళ టైటిల్ను జూన్ 1వ తేదీన ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.