Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయికలు కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితమవ్వడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా స్పెషల్ సాంగ్ల్లోనూ మెరుస్తున్నారు. ఇందులో భాగంగా తమన్నా ఇప్పటికే 'అల్లుడు శీను', 'స్పీడున్నోడు', 'జై లవకుశ' చిత్రాల్లోని ప్రత్యేక పాటల్లో మెరిసి ప్రేక్షకుల్ని అలరించారు. తాజాగా మరోసారి ఓ స్పెషల్ సాంగ్తో నాగచైతన్య సరసన స్టెప్పులేసి మెస్మరైజ్ చేయబోతున్నారు. చందుమొండేటి దర్శకత్వంలో నాగచైతన్య 'సవ్యసాచి' చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోని ఓ ప్రత్యేక పాట కోసం తమన్నాను ఎంపిక చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది.
ఇదొక విశేషమైతే, నాగార్జున నటించిన 'అల్లరి అల్లుడు' చిత్రంలోని పాపులర్ సాంగ్ 'నిన్ను రోడ్డు మీద చూసినాది.. లగాయితు'ను 'సవ్యసాచి' కోసం స్పెషల్ సాంగ్గా రీమిక్స్ చేయడం మరో విశేషం.నాగచైతన్య, తమన్నా జోడీపై చిత్రీకరించబోయే ఈ సాంగ్ చిత్రానికే హైలైట్గా నిలుస్తుందని చిత్రయూనిట్ భావిస్తోంది. గతంలో నాగచైతన్య, తమన్నా '100%లవ్', 'తడాఖా' చిత్రాల్లో నటించిన విషయం విదితమే. ప్రస్తుతం తమన్నా 'సైరా నరసింహారెడ్డి', 'క్వీర్ వన్స్ ఎగైన్', 'నా నువ్వే', 'కన్నె కలైమానె', 'ఖామోషి'తోపాటు కునాల్ కోహ్లి చిత్రంలో నటిస్తున్నారు.