Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతిలోక సుందరి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం లభించింది. ది బ్రిక్స్ అలియెన్స్ బిజినెస్ ఫోరమ్కు చెందిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ లీడర్షిప్ అవార్డులో భాగంగా లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డుకు శ్రీదేవిని ఎంపిక చేశారు. ఈ అవార్డు ప్రదానోత్సవం బుధవారం న్యూ ఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగింది. మినిస్టర్ ఆఫ్ స్టేట్ జితేంద్ర సింగ్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరిగింది. శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీ కపూర్ సోదరి రీనా మార్వా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డును అందజేస్తారు. భారతీయ సినిమాకు శ్రీదేవి చేసిన సేవలకుగానూ ఈ పురస్కారాన్ని అందజేసినట్టు
మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. బ్రిక్స్కు లారిసా జాలెంట్సోవా అధ్యక్షులుగా ఉన్నారు. శ్రీదేవి అనుమానాస్పద స్థితిల్లో ఫిబ్రవరి 24న దుబారులో కన్నుమూసిన విషయం విదితమే. ఇటీవల 'మామ్' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా శ్రీదేవిని జాతీయ అవార్డు వరించింది. అలాగే ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకల్లోను, కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలోనూ ఆమెను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులను అర్పించారు.