Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగులో ఘన విజయం సాధించిన 'ప్రస్థానం' చిత్రాన్ని సంజరు దత్, అలీ ఫాజల్ ప్రధాన పాత్రధారులుగా బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన దేవాకట్టానే బాలీవుడ్లోనూ దర్శకత్వం వహిస్తున్నారు. సాయికుమార్ నటించిన పాత్రలో సంజరు దత్ నటిస్తుండగా, శర్వానంద్ పాత్రలో అలీ ఫాజల్ నటించనున్నారు. ఇందులో కథానాయికగా అమైరా దస్తూర్ ఎంపికైంది. కథ నచ్చి తన ప్రొడక్షన్ హౌజ్లో ఆకర్షన్ ఎంటర్టైన్మెంట్తో కలిసి సంజరు దత్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సంజరు దత్ తల్లి నర్గీస్ జయంతి సందర్భంగా జూన్ 1న ఈ చిత్రం ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ తెలిపింది. సాయికుమార్, శర్వానంద్ ప్రధాన పాత్రధారులుగా దేవాకట్టా దర్శకత్వంలో 2010లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు ఎన్నో అవార్డులను అందుకుంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గోవాలో జరిగిన ఇండియన్ పనోరమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శితమైంది.