Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మహానటి'పై కొన్ని విమర్శలు వస్తున్నాయి. కానీ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కొన్ని అంశాలను వదిలేయడం జరిగింది. సావిత్రికి సంబంధించి లోతుగా అంశాలు చెబితే దాన్ని డాక్యుమెంటరీ అనే అవకాశం ఉంది. అందుకే కొన్ని అంశాల్లో స్వేచ్ఛ తీసుకున్నాం' అని దర్శకుడు నాగ్ అశ్విన్ అన్నారు. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించిన చిత్రం 'మహానటి'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రియాంక దత్ నిర్మించారు. ఈ నెల 9న విడుదలైన ఈ సినిమా మూడవ వారంలోనూ విశేష ఆదరణతో ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో శుక్రవారం చిత్ర బృందం ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు మాట్లాడుతూ, 'సినిమా బాగుంటే ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. మేం ఏదైతే అనుకున్నామో ఆడియెన్స్ అదే ఫీల్ అయ్యారు. సినిమాలో భాగం కావాలని మొదట కాప్షన్ పెట్టాం. తర్వాత ఆదరణ చూసి ఎక్స్పీరియన్ ఆఫ్ మ్యాజిక్ అని మార్చాం. ఓ మ్యాగెట్లాగా సావిత్రి ఎనర్జి సినిమాను హిట్ చేసిందనిపిస్తుంది. దర్శకుడిగా నాకు హ్యాపీగా, సినిమాలో నేనూ భాగమైనందుకు గర్వంగా ఉంది. సినిమాపై విమర్శలున్నప్పటికీ నేను సావిత్రి వైభవాన్ని చూపించే ప్రయత్నంలో భాగంగా కొన్ని విషయాలను వదిలేశాను. అన్ని పాత్రలను పాజిటివ్గా చూపించే ప్రయత్నం చేశాం. వెనకుండి సినిమాను నడిపించిన అందరికీ థ్యాంక్స్' అని అన్నారు. 'సినిమా తీయకముందు సావిత్రి గురించి పెద్దగా తెలియదు. ఆమె లైఫ్ను చూసి షాక్ అయ్యాను. మైండ్ బ్లో అయ్యింది. సినిమాను నాగ్ అశ్విన్ నడిపించిన విధానం గ్రేట్. 'మహానటి'లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. సినిమాలో నేనూ ఓ పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది' అని విజరు దేవరకొండ తెలిపారు. కీర్తి సురేష్ చెబుతూ, 'సినిమాకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. నా పాత్ర గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. నన్ను సపోర్ట్ చేసిన మీడియా, అమ్మానాన్నలకు థ్యాంక్స్. ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు నాగి, నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమాకు ఎంతో మంది సపోర్ట్ చేశారు. అందరూ కష్టపడటం వల్లే ఇంత పెద్ద సక్సెస్ సాధ్యమైంది' అని చెప్పారు.
'ప్రేక్షకులు న్యాయనిర్ణేతలు. సినిమాను తీసే విధంగా తీస్తే విజయం సాధ్యమని నిరూపించారు. వారికి ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువే అవుతుంది. కీర్తి సురేష్ నటించిన సావిత్రి పాత్రను చూస్తుంటే నిజంగా సావిత్రిని చూసిన ఫీలింగ్ కలిగింది. మా అమ్మ కూడా అదే చెప్పింది. 'మహానటి' ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్న ప్రేక్షకులు గొప్ప వారు' అని సాయిమాధవ్ బుర్రా చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ, 'ఈ సినిమా విజయం మాపై బాధ్యతను పెంచింది. మున్ముందు మరింత బాధ్యతగా మంచి సినిమాలు చేస్తాం' అని అన్నారు.