Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం 'ఆపరేషన్ 2019'. 'బివేర్ ఆఫ్ పబ్లిక్' అనేది ట్యాగ్లైన్. యజ్ఞాశెట్టి కథానాయిక. కరణం బాబ్జి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై అలివేలు నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్లో జరిగింది. అతిథిగా విచ్చేసిన దర్శకుడు వి.వి.వినాయక్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ట్రైలర్, డైరెక్టర్ మేకింగ్ చాలా బాగుంది. సినిమాకు మంచి పేరు, నిర్మాతకు డబ్బులు రావాలి. శ్రీకాంత్ ఇండిస్టీలో అందరికి ఇష్టమైన హీరో. నాకు ఎక్కువగా ఇష్టం. ఆయన మంచి నటుడే కాదు, మంచి మనిషి కూడా. చాలా మందికి సాయం చేశారు. సినిమా అందరికి మంచి పేరు తీసుకురావాలి' అని అన్నారు. 'శ్రీకాంత్ డిఫరెంట్ గెటప్, భిన్న పాత్రలు పోషించిన ప్రతి సినిమా ఆయనకు మంచి పేరుతోపాటు మంచి విజయాన్ని సాధించాయి. ఆ కోవలోనే 'ఆపరేషన్ దుర్యోధన', 'మెంటల్ పోలీస్' బాగా ఆడాయి. ఇలాంటి పాత్రలు చేస్తూ యువ హీరోలకు శ్రీకాంత్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 'ఆపరేషన్ దుర్యోధన' నటుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దర్శకుడు కరణం బాబ్జి మంచి రైటర్. సమాజానికి సంబంధించిన సబ్జెక్ట్లను డీల్ చేయడంలో ఆయన దిట్ట' అని ప్రభాకర్ చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ, 'ఈ సినిమా మొదట్నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు నిర్మాతలు నవ్వుతూనే ఉన్నారు. సినిమా అంత బాగా వచ్చింది. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సాగే చిత్రం. ఇందులో నా గెటప్ కొత్తగా ఉంటుంది. 'మెంటల్ పోలీస్' తర్వాత దర్శకుడు బాబ్జితో చేస్తున్న చిత్రమిది. ఆయన నిర్మాతల దర్శకుడనాలి. ఎందుకంటే అమెరికాలో నాలుగు రోజుల షూటింగ్ ఉన్నప్పుడు నిర్మాణ ఖర్చులు తగ్గించడానికి 'మీరు అమెరికాకి వెళ్ళి అక్కడ మీకున్న నెట్వర్క్తో మీరే మేకప్, కెమెరా అరెంజ్ చేసుకోవాలి' అని నాతో చెప్పారు. చెప్పినట్టుగానే నేను అన్ని అరెంజ్ చేసుకున్నాను. అందుకు సహకరించిన వరప్రసాద్కు థ్యాంక్స్. సినిమా బాగా రావడానికి క్రెడిట్ అంతా దర్శకుడికే దక్కుతుంది' అని అన్నారు. 'సినిమా ఆడాలంటే స్టార్లు అవసరం లేదని 'మహానటి' నిరూపించింది. సినిమా ఆడాలంటే మంచి నటీనటులు కుదరాలి. ఈ సినిమాకు అలా కుదిరారు. బట్టలు లేకుండా పోస్టర్పైన కనిపించాలంటే ఏ హీరో కూడా ఒప్పుకోరు. అలాంటి దమ్ము శ్రీకాంత్లో ఉంది. అందుకే ఆయన ఒప్పుకున్నారు. ఇందులో ముగ్గురు యువ హీరోలున్నారు. 'లజ్జ' సినిమాలో కథానుసారం మనీషా కోయిరాలాతోపాటు కొంత మంది ఆర్టిస్టులు ట్రావెల్ అవుతుంటారు. ఈ చిత్రంలో కూడా అలానే ఉంటుంది. పక్కా స్క్రీన్ప్లేతో చేసిన చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో భాగంగా డి.ఐ వర్క్ జరుగుతోంది. జూన్ 15 వరకు సెన్సార్ పూర్తి చేసుకుని, నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాం' అని దర్శకుడు బాబ్జి చెప్పారు. ఈ కార్యక్రమంలో శివకృష్ణ, సమీర్, యజ్ఞాశెట్టి, సతీష్, రాప్ రాక్ షకీల్, రామ్జగన్, దిల్ రమేష్, జెన్ని, దీక్షాపంత్, గిరిధర్, నిర్మాత అలివేలు తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.