Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తోటి నటీనటులు నటించిన సినిమాలు బాగుంటే ఇతర నటీనటులు ప్రశంసించడమనే ఆరోగ్యకరమైన వాతావరణం చిత్ర పరిశ్రమలో ఇటీవల బాగా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్ హీరోలు సైతం ఇతర హీరోల సినిమాలను, వారి ప్రతిభను అభినందిస్తున్నారు. తాజాగా 'భరత్ అనే నేను' ఫేమ్ కైరా అద్వాని నటించిన 'లస్ట్ స్టోరీస్' (నాలుగు లఘు చిత్రాల కలయిక) పై రకుల్ ప్రీత్ సింగ్ ప్రశంసలు కురిపించారు. స్వేచ్చ కోసం, అణగారిన కోరికలను నెరవేర్చుకునేందుకు మహిళలు పడే తపన నేపథ్యంలో రూపొందిన ఈ నాలుగు షార్ట్ ఫిల్మ్స్పై రకుల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, 'ఈ కథల ప్రపంచంలో మెరుగైన ఆలోచన, ముందు చూపుతో తెరకెక్కిన లఘు చిత్రాలివి. మనుషులు ముఖ్యంగా మహిళల ఆశలు, ఆకాంక్షలను బలంగా చూపించారు. ఇందులో నటించిన నటీనటులందరూ తమ పాత్రల్లో జీవించారు. కైరా అద్వానీ నటనకు నేను ముగ్దురాలినైపోయా. ఆమెతోపాటు టీమ్ అందరికీ శుభాకాంక్షలు' అని తెలిపారు. అందుకు రకుల్కి కైరా ధన్యవాదాలు తెలిపారు. కైరా అద్వానీ, రాధికా అప్టే, భూమి పడ్నేకర్, మనీషా కోయిరాలా, నేహా ధూపియా ఈ నాలుగు లఘు చిత్రాల్లో నటించారు. వీటికి కరణ్ జోహర్, అనురాగ్ కశ్యప్, దివాకర్ బెనర్జీ, జోయా అక్తర్ దర్శకత్వం వహించడం విశేషం. 'లస్ట్ స్టోరీస్' అద్భుతం అంటూ బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.