Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్లో ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ వంటి స్టార్ హీరోయిన్లు నిర్మాతలుగా రాణిస్తూ
తమ అభిరుచి చాటుకుంటున్నారు. అలాగే తాజాగా దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం నిర్మాతగా మారబోతున్నారు. తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ కోసం ఆమె నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతార ప్రధాన పాత్రలో నటించనున్నారు. యువ కథానాయకుడు అథర్వ హీరోగా నటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్ళనుందట. దర్శకుడు విగేష్ శివన్, నయనతార గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం విదితమే. త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో నయనతార నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తుండటం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం నయనతార తెలుగులో చిరంజీవి సరసన తొలిసారి 'సైరా నరసింహారెడ్డి'లో నటిస్తున్నారు. తమిళంలో 'ఇమైక్కా నోడగల్', 'కోలైయుథిర్ కాలమ్', 'కోలమవు కోకిలా', 'విశ్వాసం'
చిత్రాల్లో బిజీగా ఉన్నారు.