Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్లోబల్ స్టార్గా రాణిస్తున్న ప్రియాంక చోప్రా బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తూ సల్మాన్ సరసన 'భారత్' చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. 'వక్త్' చిత్రంలో హోలీ సాంగ్లో మెరిసిన ఈ ఇద్దరు మరోసారి ఈ చిత్రంలో హోలీ పాటలో కలిసి నర్తించబోతున్నారట. త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే, ప్రియాంక తన ఆత్మకథ రాశారు. 'అన్ఫినిష్డ్' పేరుతో ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా పబ్లికేషన్స్ ప్రచురించనుంది. ఇందులో తాను సేకరించిన వ్యాసాలు, కథలు, జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, పలు ముఖ్య సంఘటనలను వివరించారట. దీని గురించి ప్రియాంక మాట్లాడుతూ, 'ఈ పుస్తకాన్ని ఎంతో నిజాయితీగా, సరదాగా, ముక్కుసూటిగా, ఎవరినీ విమర్శించకుండా రాశాను. గతంలో నా వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ బయటకి చెప్పలేదు. ఈ పుస్తకంలో వివరించాల్సిన అవసరం వచ్చింది' అని తెలిపారు. బుధవారం వరల్డ్ శరణార్థుల దినోత్సవం. యునిసెఫ్కు గుడ్విల్ అంబాసిడర్గా పనిచేస్తున్న ప్రియాంక చోప్రా వరల్డ్ శరణార్థుల రోజుని పురస్కరించుకుని బాల శరణార్థులకు అండగా నిలిచారు. వారికి సపోర్ట్ కావాలని కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు. 'శరణార్థ బాలలు ఒక తరాన్ని కోల్పోయారు. ఈ క్రమంలో వారి జీవితం హింసాత్మకంగా మారింది. దీంతో ఎన్నో అవకాశాలు కోల్పోతున్నారు' అని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు.