Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందు, తేజస్విని ప్రకాష్ జంటగా బిక్స్ ఇరుసడ్ల దర్శకత్వంలో ఏఎస్పీ క్రియేటివ్ పతాకంపై భాస్కర్ భాసాని నిర్మిస్తున్న చిత్రం 'కన్నుల్లో నీరూపమే'. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత భాస్కర్ భాసాని మాట్లాడుతూ, 'విడుదలైన మా చిత్ర ఆడియోకు మంచి స్పందన లభించింది. సినిమా కూడా ప్రేక్షకుల మనసులను హత్తుకునేలా ఉంటుందని భావిస్తున్నా. మా సినిమాను శ్రీకాంత్రెడ్డి, ఇప్పిలి రామ్మోహన్ రావు చూసిన తర్వాత ఈ చిత్రాన్ని హరిహర చలన చిత్ర బ్యానర్పై విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు. అందుకు వారికి ధన్యవాదాలు. ఈ నెల 29న విడుదల కానున్న సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
'సినిమా నచ్చి సపోర్ట్ చేయాలనిపించింది. మంచి కథను చాలా క్వాలిటీగా రాజీపడకుండా తెరకెక్కించారు. సాహెత్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుంది. దర్శకుడు బిక్స్కిది తొలి చిత్రమే అయినా దర్శకుడిగా సక్సెస్ అయ్యారు' అని ఇప్పిలి రామ్మోహన్రావు చెప్పారు.
దర్శకుడు బిక్స్ మాట్లాడుతూ, 'అందరికి నచ్చే చిత్రమవుతుంది. హీరోహీరోయిన్లు చాలా బాగా నటించారు. మాకు శ్రీకాంత్రెడ్డి, రామ్మోహన్రావు సినిమా విడుదలలో సపోర్ట్గా నిలవడం హ్యాపీగా ఉంది' అని చెప్పారు.