Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టార్ హీరోయిన్గా రాణించిన శ్రుతి హాసన్ నిర్మాతగా మారి లఘు చిత్రాలను, మ్యూజిక్ ఆల్బమ్స్లను రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఆమె పూర్తి స్థాయి సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. తండ్రి కమల్ హాసన్ రూపొందిస్తున్న 'శభాష్ నాయుడు' చిత్రానికి నిర్మాణ పరంగానూ శ్రుతి బాధ్యతలు తీసుకున్నారు. ఆ అనుభవంతో త్వరలోనే ఓ సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సొంత సంస్థ ఇసిడ్రో మీడియా పతాకంపై జయప్రకాష్ రాధాకృష్ణన్ దర్శకత్వంలో 'ది మస్కిటో ఫిలాసఫీ' అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. అయితే ఇది సినిమానా లేక వెబ్ సిరీసా అనే మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట.
ఇదిలా ఉంటే ఆగిపోయిన 'శభాష్ నాయుడు' చిత్రాన్ని తిరిగి పూర్తి చేసేందుకు కమల్ శాయశక్తులా కృషి చేస్తున్నారట. ప్రస్తుతం ఆ పనుల్లో శ్రుతి కూడా బిజీగా ఉందని చిత్ర బృందం తెలిపింది. తెలుగులో రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోని', హిందీలో మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ చిత్రంలో శృతి నటిస్తున్నారు.