Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని అఖిల్ హీరోగా తెరంగేట్రం చేసిన 'అఖిల్' చిత్రంతో సాయేషా సైగల్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్లో అజరు దేవగణ్ సరసన 'శివారు' చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుని హిందీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రస్తుతం తమిళంలో కార్తీ హీరోగా రూపొందుతున్న 'చినబాబు' చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న సాయేషా తాజాగా కార్తీ అన్నయ్య, స్టార్ హీరో సూర్య సరసన నటించే లక్కీ ఛాన్స్ను అందిపుచ్చుకున్నారు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య, మోహన్లాల్, అల్లు శిరీష్ ప్రధాన పాత్రధారులుగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో సూర్యకు జోడీగా సాయేషాను ఫైనల్ చేశారట. 'చినబాబు' చిత్రంలో ఆమె నటనకు ఇంప్రెస్ అయిన సూర్య తన నూతన చిత్రానికి ఆమెను ఎంపిక చేశారట. దీంతో సాయేషా ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'డైనమిక్ నటుడు సూర్య, మోహన్లాల్, శిరీష్లతో వెండితెరను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. లండన్లో కలుద్దాం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి' అని సాయేషా ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె 'జుంగా', 'ఘజినికాంత్' చిత్రాల్లో నటిస్తున్నారు.