Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'క్వీన్ చిత్రంలో కంగనా రనౌత్ నటన చూసి మైమరచిపోయాను. ఆమె పాత్రలో ఇప్పుడు నేను నటించడం చాలా ఆనందంగా ఉంది' అని కాజల్ అన్నారు. బాలీవుడ్లో కంగనా రనౌత్ హీరోయిన్గా వచ్చిన 'క్వీన్' చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, తమిళంలో కాజల్ నటిస్తున్నారు. 'పారిస్ పారిస్' అనే టైటిల్తో రమేష్ అరవింద్ రూపొందిస్తున్నారు. ఈ చిత్ర అనుభవాన్ని తాజాగా కాజల్ పంచుకుంటూ, 'నాలుగు గోడల మధ్య నుంచే గొంగళి పురుగు లాంటి అమ్మాయి సీతాకోక చిలుకగా మారిన కథే 'క్వీన్'. ఇలాంటి కథా చిత్రాల్లో నటించాలన్నది నా చిరకాల కోరిక. మొదట ఈ సినిమాలో నటించమని నిర్మాతలు నన్ను కలిసినప్పుడు కాస్త సంకోచించాను. ఇప్పుడు సినిమా రూపొందుతున్న తీరు, నా పాత్ర తీరుతెన్నులు చూస్తుంటే నమ్మకం కలిగింది. చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో ఒక్కో భాషలో ఒక్కో నటి నటించడం సంతోషించదగ్గ విషయం. చిత్ర దర్శకుడు రమేష్ అరవింద్ నటుడు కావడంతో నా పాత్రలో సహజంగా నటించడంలోనూ, ప్రతి సన్నివేశం భావాన్ని గ్రహించి అర్థవంతంగా నటించి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు వారి అంచనాలను పూర్తి చేయడానికి ఎంతగానో సహకరిస్తున్నారు. ఇది నా కెరీర్లో గుర్తిండిపోయే చిత్రమవుతుంది' అని అన్నారు.