Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఛలో' సక్సెస్ను అందుకున్న నాగశౌర్య ఇప్పటికే ఓ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా నాగశౌర్య నటించే మరో చిత్రం శనివారం ప్రారంభమైంది. రాజా కొలుసును దర్శకుడిగా పరిచయం చేస్తూ భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్లోని కూకట్పల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాతలు ఆనంద ప్రసాద్, శంకర్ ప్రసాద్ దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా నిర్మాత ఆనందప్రసాద్ మాట్లాడుతూ, 'బాలకృష్ణ 'పైసా వసూల్' తర్వాత మా సంస్థలో నిర్మిస్తున్న చిత్రమిది. 'ఛలో'తో మంచి సక్సెస్ అందుకున్న నాగశౌర్య హీరోగా, రాజాని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా హ్యాపీగా ఉంది. మా బ్యానర్లో ఇది 9వ చిత్రం. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: మహతి స్వర సాగర్, ఆర్ట్: వివేక్, ఎడిటర్: ప్రవీణ్ పూడి.