Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అర్జున్రెడ్డి' ఫేమ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం(బుజ్జి) దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక మండన్నా కథానాయిక. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్న చిత్రానికి 'గీతగోవిందం' అనే టైటిల్ని ఖరారు చేస్తూ శనివారం చిత్ర ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, ''పెళ్ళిచూపులు', 'అర్జున్రెడ్డి' చిత్రాలతో విజయ్ దేవరకొండ తనదైన నటనతో స్టార్డమ్ను సంపాదించారు. 'శ్రీరస్తు
శుభమస్తు' తర్వాత దర్శకుడు పరశురాం మా బ్యానర్లో చేస్తున్న రెండో చిత్రమిది. మంచి కథ రాసుకుని, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. హీరోయిన్ రష్మిక పాత్ర మన పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. విజయ్, రష్మికల మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా కుదిరాయి. ఈ సినిమా విజయ్ కెరీర్లో మరో బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది' అని అన్నారు. 'రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. సినిమాలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ స్టార్ విజయ్దేవరకొండ గోవిందం పాత్రలో అలరించబోతున్నారు. విజరు ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని పాత్రని డిజైన్ చేశాం. గోవిందం తన యాటిట్యూడ్ని ఎక్కడా తగ్గనివ్వకుండా చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్తో అందరినీ అలరిస్తాడు. గీత పాత్రలో రష్మిక పరకాయ ప్రవేశం చేశారు. గీత పాత్రలాగే రష్మిక నిజ జీవితంలో ఉంటారు. ఈ ఇద్దరు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందనేది ఫస్ట్లుక్ చూస్తే అర్థమవుతుంది' అని దర్శకుడు పరుశురాం చెప్పారు. నిర్మాత బన్నివాసు చెబుతూ, 'టాలెంట్ ఉంటే చాలు అదే నీకు కేరాఫ్ అంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన అల్లు అరవింద్కు థ్యాంక్స్. యూత్, ఫ్యామిలీ ఏం కోరుకుంటున్నారో అలాంటి సినిమాలే ప్రేక్షకులకు అందించాలని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు. విజరు హార్ట్ ఎంత గొప్పదో, ఈ సినిమా అంత గొప్పదని నా అభిప్రాయం. పరుశురాంకి ఫ్యామిలీ ఎమోషన్స్ని తెరకెక్కించడం వెన్నతో పెట్టిన విద్య. గోపీసుందర్ సంగీతం సినిమాకు ప్రాణం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం' అని అన్నారు.