Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్న వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా 'ఎఫ్2'(ఫన్ అండ్ ఫ్రస్టేషన్) పేరుతో ఓ మల్టీస్టారర్ తెరకెక్కనున్న విషయం విదితమే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. వెంకటేష్, వరుణ్తేజ్, మెహరీన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అతిథిగా విచ్చేసిన నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. దిల్రాజు, అల్లు అరవింద్, వెంకటేష్, వరుణ్తేజ్లు కలిసి దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. 'అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం జులై 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇందులో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కమర్షియల్ వ్యాల్యూస్తో కామెడీ ఎంటర్టైనర్స్ను తెరకెక్కించే అనిల్ రావిపూడి ఈ సినిమాను ఆద్యంతం ఫన్ రైడర్గా రూపొందించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సమీర్ సినిమాటోగ్రాఫర్. సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు' అని చిత్రయూనిట్ చెప్పింది.