Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నటుడు వినోద్(59) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్తో హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 2గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎక్కువగా విలన్ పాత్రలతో పాపులర్ అయిన వినోద్ క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించారు. టెలివిజన్ సీరియల్స్లోనూ నటించారు. దాదాపు 300లకుపైగా చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన విలక్షణ నటనతో తెలుగు ఆడియెన్స్ను విశేషంగా ఆకట్టుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన వినోద్ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. 'కీర్తికాంత కనకం' చిత్రం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించి చిన్న చిన్న పాత్రలు చేసి క్రమ క్రమంగా ఎదిగారు. 'లారీ డ్రైవర్', 'చంటి', 'నల్లత్రాచు', 'భైరవద్వీపం', 'నరసింహనాయుడు', 'ఇంద్ర', 'మిర్చి' వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. ఎక్కువగా ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్గా నటించారు. దీంతోపాటు 28 తమిళ చిత్రాల్లో, రెండు హిందీ సినిమాల్లోనూ నటించారు. వినోద్కు భార్య వీనావతి, కూతుళ్ళు శిరీష, తేజస్వీ, కుమారుడు సురేష్ ఉన్నారు. వినోద్ మృతి పట్ల 'మా', సినీ పెద్దలు ప్రగాఢ సంతాపం తెలిపింది.