Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధాకర్ కోమాకుల, నిత్యాశెట్టి జంటగా హరినాథ్.బి దర్శకత్వంలో బేబీ జాహ్నవి సమర్పణలో యునైటెడ్ ఫిల్మ్స్, ఎస్.జె.కె ప్రొడక్షన్స్ పతాకంపై డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం 'నువ్వు తోపురా'. ప్రముఖ హీరోయిన్ నిరోషా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను శనివారం అతిథిగా విచ్చేసిన విజరు దేవరకొండ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నేను 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రానికి ఆడిషన్కి వెళ్ళినప్పుడు సుధాకర్ నాకు బాగా సపోర్ట్ చేశారు. అతను చేసిన ఫోటో షూట్ స్టిల్స్ 'ఎవడే సుబ్రమణ్యం' చిత్రానికి ఛాన్స్ రావడానికి కారణమయ్యాయి. ఈ చిత్ర లైన్ విన్నప్పుడే హిట్ అనే ఫీలింగ్ కలిగింది. టీజర్ ఎక్స్లెంట్గా ఉంది. టికెట్ కొని ఫ్యామిలీతో ఈ సినిమా చూస్తా. సినిమా పెద్ద విజయం సాధించి సుధాకర్కి మంచి పేరు తీసుకురావాలి' అని అన్నారు. 'నేను ఆరేండ్ల గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రమిది. ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని టీమ్ అంతా కష్టపడి సినిమాకు పనిచేశాం. హరినాథ్ అద్భుతంగా తెరకెక్కించారు. శ్రీకాంత్ రాజీపడకుండా నిర్మించారు. నిరోషా 12ఏండ్ల తర్వాత తెలుగులో నటించారు. నేను నటించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలోని నాగరాజు క్యారెక్టర్ విత్తు అయితే ఈ చిత్రంలోని సూరి పాత్ర పెద్ద మొక్క. యారగెంట్గా ఉన్న కుర్రాడు యుఎస్ వెళ్ళి తన లైఫ్లో ఎలా ఎదిగాడనేది కథ. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది' అని సుధాకర్ కోమాకుల తెలిపారు. దర్శకుడు బి.హరినాథ్ చెబుతూ, 'కృష్ణవంశీ, వై.వి.ఎస్.చౌదరి వద్ద అసిస్టెంట్ డైర్టెర్గా పనిచేశా. నా మొదటి చిత్రమిది. యుఎస్లో షూటింగ్ చేస్తానని అస్సలు ఊహించుకోలేదు. సినిమా అందరికి నచ్చుతుంది' అని చెప్పారు. 'ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన స్టోరీ ఇది. అందరు చూసి ఎంజారు చేసేలా ఉంటుంది' అని నిర్మాత తెలిపారు. '12ఏండ్ల గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తున్నా. పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలిగింది. ఇది నాకు కచ్చితంగా కమ్బ్యాక్ చిత్రమవుతుంది' అని నిరోషా తెలిపారు.