Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్బాబు ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్.ఎస్.నాయుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధీర్బాబు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ చిత్రాన్ని వినాయకచవితి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ,'ఇటీవల విడుదల చేసిన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆఫీస్ మొత్తం భయపడే సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్గా సుధీర్బాబు, బాగా అల్లరి చేసే గడుసమ్మాయిగా హీరోయిన్ సభా నటేశ్ నటించిన తీరు అందరినీ అలరిస్తోంది. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 13న విడుదల చేస్తున్నాం. సెప్టెంబర్ 12న ప్రీమియర్ షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అలాగే ప్రేక్షకులకు దగ్గరగా, వారి మనసుని దోచుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్ర ప్రమోషన్ని చేయబోతున్నాం. 'సమ్మోహనం'వంటి బ్లాక్బస్టర్ తర్వాత సుధీర్బాబు నటిస్తున్న చిత్రం కావటంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టునే సినిమా ఉంటుంది. అలాగే ప్రమోషన్ని కూడా ఆ రీతిలో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఫ్రెష్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సినిమా నిర్మాణ విషయంలో సుధీర్బాబు ఎక్కడా రాజీపడటం లేదు. ఈ చిత్రానికి అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తుంది' అని చెప్పారు. నాజర్, తులసి, వేణు, రవివర్మ, జీవా, వర్షిణి, సౌందరరాజన్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి డిఓపి : సురేష్ రగుతు, సంగీతం : అజనీష్ బి.లోకనాథ్, ఆర్ట్ : శ్రీకాంత్ రామిశెట్టి, ఎడిటింగ్ : ఛోటా.కె.ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్.సాయివరుణ్.