Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు, శ్రీ తనయుడు రాజేష్ శ్రీ చక్రవర్తిని హీరోగా పరిచయం చేస్తూ సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ సంస్థ 'శివకాశీపురం' అనే సినిమాను నిర్మిస్తుంది. మోహన్బాబు పులిమామిడి నిర్మాత. హరీష్ వట్టికూటి దర్శకుడు. ప్రియాంక శర్మ కథానాయిక. విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాత మోహన్బాబు పులిమామిడి మాట్లాడుతూ, 'అందరి సపోర్ట్తో మంచి సినిమా నిర్మించాం. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీపడలేదు. విడుదల విషయంలో కూడా రాజీ పడటం లేదు. సెన్సార్తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 3న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. 'నాకిది తొలి చిత్రమైనా నిర్మాత అందించిన సహకారంతో అనుకున్న విధంగా సినిమా ఔట్పుట్ను ఇవ్వగలిగాను. ఇదొక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. విభిన్న కథాంశాలతో రూపొందిన చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. మంచిర్యాల, కాజీపేట, గాంధారి ఖిలాలలో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్, పాటలు సినిమాకి హైలైట్గా నిలుస్తాయి. ఎస్పీ.బాలు, యాజన్ నిజార్ (శ్రీమంతుడు ఫేమ్), హేమచంద్ర పాడిన పాటలు యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి' అని దర్శకుడు తెలిపారు. విడుదలను పర్యవేక్షిస్తున్న వి.ఎస్.విజరువర్మ పాకలపాటి మాట్లాడుతూ, 'సినిమా నచ్చడంతో ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ చిత్ర విడుదల పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నాను. సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాని రిలీజ్ చేస్తాం. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన చిత్రంగా ఇది నిలవడం ఖాయం' అని తెలిపారు.