Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదని ప్రొడక్షన్ కంపెనీ డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్పై, నిర్మాత దానయ్యపై వస్తున్న ఆరోపణలు నన్ను షాక్కి గురి చేశాయి. ఒకవేళ నాకు పారితోషికం ఇవ్వకపోతే అదే నిర్మాతతో, అదే ప్రొడక్షన్ హౌస్లో నిర్మితమయ్యే తదుపరి చిత్రంలో ఎలా నటిస్తాను?' అని కైరా అద్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. డి.వి.వి. దానయ్య నిర్మించిన 'భరత్ అనే నేను' చిత్రంలో కైరా అద్వానీ కథానాయికగా నటించిన విషయం విదితమే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్బాబు హీరోగా నటించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు కొరటాల శివ, నటి కైరా అద్వానీకి ఇవ్వాల్సి పారితోషికాన్ని ఇంకా ఇవ్వలేదని ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ వార్తలను నిర్మాత దానయ్య కూడా ఖండించారు.
ఈ ఇష్యూపై తాజాగా కైరా స్పందించారు.
'ఇవన్నీ బేస్లెస్ ఆరోపణలు. డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ వంటి ప్రొఫెషనల్ ప్రొడక్షన్ హౌస్లో పనిచేయడాన్ని నేను గౌరవంగా భావిస్తాను. ఒకవేళ నిర్మాత దానయ్యగారు నాకు డబ్బు ఇవ్వకపోతే ఆయన నిర్మించే తదుపరి చిత్రంలో ఎలా నటిస్తాను?. దానయ్యగారి బ్యానర్లో మళ్ళీమళ్ళీ పనిచేయాలనుంది' అని తెలిపారు. డి.వి.వి దానయ్య నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న నూతన చిత్రంలో రామ్చరణ్ సరసన కైరా కథానాయికగా నటిస్తున్నారు. దీంతోపాటు తాజాగా బాలీవుడ్లో ఓ క్రేజీ ఆఫర్ని కూడా దక్కించుకున్నారు. రాజ్ మెహతా దర్శకత్వంలో అక్షరు కుమార్, కరీనాకపూర్, దిల్జిత్ దోసాంజే ప్రధాన పాత్రధారులుగా కరణ్ జోహార్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో దిల్జిత్ దోసాంజే సరసన కైరా నటించనుంది. అక్షరు కుమార్, కరీనా కపూర్ మరో జంటగా నటిస్తున్నారు. ప్రేమ, పెళ్ళి విషయంలో రెండు జంటల జర్నీని తెలిపే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కరణ్ జ