Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఆయన సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకోవడం కామనే. పర్ఫెక్ట్గా బౌండెడ్ స్క్రిప్ట్ తయారు చేసుకున్నాకే సినిమా మొదలు పెడతారు. గతేడాది వచ్చిన 'ఫిదా' తర్వాత శేఖర్ కమ్ముల నెక్ట్స్ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా ఆయన హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా ఓ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రంతో ధృవ్ను తెలుగు తెరకు పరిచయం చేయాలని భావిస్తున్నారు. తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఆయనే నిర్మించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ధృవ్ తమిళంలో 'అర్జున్రెడ్డి' రీమేక్ 'వర్మ'లో నటిస్తున్నారు. తమిళంలో హీరోగా పరిచయమవుతున్న చిత్రమిది. శేఖర్ కమ్ముల గతేడాది రూపొందించిన 'ఫిదా' ఎంతటి ఘన విజయం సాధించిందో విదితమే. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ.40కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది.