Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తీ, సయేషా సైగల్ జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో 2డి ఎంటర్టైన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్ పతాకంపై సూర్య, మిర్యాల రవీందర్రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'చినబాబు'. ఇటీవల విడుదలైన సినిమాకు మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో సోమవారం సక్సెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ, 'ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినిమా చూసి యూనిట్ను అభినందిస్తూ ట్విట్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన ప్రశంస వల్ల సినిమాపై నమ్మకం మరింత పెరిగింది. ఆయన ప్రశంసలను గౌరవంగా భావిస్తున్నాం. ఇప్పుడు అందరికీ ఫ్యామిలీ ఎమోషన్స్ పెరిగిపోయాయి. చిన్న కుటుంబాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఈ సినిమా చూసి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ఇటీవల వైజాగ్, కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో తిరిగాం. చిన్న చిన్న పట్టణాల్లో కూడా థియేటర్స్ హౌస్ఫుల్ అవుతున్నాయి. అన్నయ్య(సూర్య)తో కలిసి ఈ సినిమా చేశాను. కాబట్టి నాకిది చాలా స్పెషల్' అని అన్నారు. 'సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినిమా చూసి ట్వీట్ చేశారు. రైతు కుటుంబాల్లోని రిలేషన్స్, ఉమ్మడి కుటుంబాల్లోని బంధాలు, బంధుత్వాల గురించి ఆయన వ్యక్తిగతంగా ట్వీట్ చేయడం, తెలుగు, తమిళ నేటివిటీకి దగ్గరగా సినిమా ఉండదని చెప్పడం సంతోషంగా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఆనందంతో బయటకు వస్తున్నారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి తెలిపారు. హీరోయిన్ సయేషా సైగల్ చెబుతూ, 'పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించడం కొత్తగా ఉంది.
కార్తీ సరసన నటించడం లక్గా భావిస్తున్నా. ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్'' అని చెప్పారు.