Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఘనమైన చరిత కలిగిన జయలలిత జీవితాన్ని తెరకెక్కించ బోతున్నందుకు హ్యాపీగా ఉంది' అని నిర్మాత విష్ణు ఇందూరి అన్నారు. జయలలిత ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం విదితమే. తాజాగా ఆమె బయోపిక్ను విబ్రి మీడియా పతాకంపై తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'ప్రస్తుతం మా బ్యానర్లో 'ఎన్టీఆర్' బయోపిక్ను రూపొందిస్తున్నాం. తాజాగా మోస్ట్ ఛార్మింగ్, డాషింగ్ పొలిటీషియన్ గా చరిత్రలో నిలిచిపోయిన జయలలిత జీవితాన్ని తెరకెక్కించడం ఆనందంగా ఉంది. భారతీయ రాజకీయాల్లో ఆమె ప్రస్థానం ఒక చెరగని సంతకం. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఆమె ఎచీవ్మెంట్స్ను ఈ సినిమాలో చూపించనున్నాం. ఫిబ్రవరి 24న జయలలిత పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించనున్నాం. అదే రోజు చిత్ర ఫస్ట్లుక్ను విడుదల చేస్తాం' అని విబ్రి మీడియా డైరెక్టర్, సైమా అవార్డ్స్ చైర్మెన్ బృందాప్రసాద్ అడుసుమిల్లి తెలిపారు. ''మదరాసుపట్టణం' చిత్రంతో దర్శకుడిగా ఎన్నో అవార్డులను అందుకున్న విజరు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తారు. దర్శకుడు విజరు సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటున్నారు. వచ్చే ఏడాదిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. బాలీవుడ్, సౌత్కు చెందిన ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తారు. దీంతోపాటు ఈ ఏడాది వరల్డ్ కప్ ఆధారంగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో '83' చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నారు. మా బ్యానర్లో నిజమైన కథలు, జీవితాలను తెరకెక్కించాలనే మా కల' అని విష్ణు ఇందూరి తెలిపారు.