Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గ్లామర్ పాత్రలు చేయడం నాకిష్టం లేదు. అలాంటి పాత్రలు చేయడానికి నేను గ్లామరస్ పర్సన్ని కాదు. నెగటివ్ పాత్రలు పోషించాలనుంది' అని అంటోంది రష్మిక మందన్నా. విజరు దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గీత గోవిందం'. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం విడుదలైన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సందర్భంగా రష్మిక గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం ఆమె మాటల్లోనే..
ఫస్ట్డే మార్నింగ్ షోనే..
ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు మా పేరెంట్స్తో డిస్కస్ చేశా. నాకు బాగా నచ్చింది. పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో ఎలాగైనా చేయాలనుకున్నా. ఇద్దరు పాత్రల ప్రధానంగా సాగే చిత్రమిది. నా కంటే ముందు ముగ్గురు, నలుగురు కథానాయికలను ఆడిషన్ చేశారట, కానీ పరుశురామ్ నేనే కావాలని పట్టుపట్టారట. ఈ పాత్ర నాకు రావడం లక్కీగా భావిస్తున్నా. సినిమాలో మొత్తం కోపంతో కనిపించాల్సి వచ్చింది. అది చాలా కష్టం. నేను బేసిక్గా నవ్వుతూ ఉంటాను. పైగా విజరు దేవరకొండ 'మేడమ్ మేడమ్' అంటూ బ్రతిమాలుతుంటే నవ్వు ఆపుకోలేకపోయేదాన్ని. నవ్వుని కంట్రోల్ చేసుకుని సీరియస్గా కనిపించడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏడు నెలలు అలానే ఉన్నా. షూటింగ్ చివరి రోజులు మాత్రం సరదాగా నవ్వుతూ ఉన్నాను. సినిమాను మానిటర్లో చూడటం ఇష్టం ఉండదు. డైరెక్ట్గా ఫస్ట్ డే మార్నింగ్ షో థియేటర్లో చూశా. ఆడియెన్స్ మధ్య ఎంజారు చేశా.
క్రికెట్ అంటే భయం..
విజరు దేవరకొండ హార్డ్ వర్కర్. సెట్లో చాలా సరదాగా ఉంటాడు. తనతో ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' చిత్రం చేస్తున్నా. క్రికెట్ నేపథ్యంలో సాగే చిత్రమిది. నాకు క్రికెట్ ఆడటమంటే భయం. భాస్కెట్బాల్, బాడ్మింటన్, ఫుట్బాల్ వంటి వన్నీ ఆడుతాను. కానీ క్రికెట్ అంటే భయమేస్తుంటుంది. ఈ చిత్రం కోసం క్రికెట్ ఆడేటప్పుడు చాలా హార్డ్గా అనిపించింది. కొన్ని టెక్నిక్స్ తెలిస్తే ఆడటం ఈజీ. ప్రస్తుతం ఆ పనిలో బిజీగా ఉన్నా. భాష అనేది నాకు డిఫికల్ట్. 'గీతగోవిందం'లో పాత్రలో సహజత్వం కోసం లిప్ సింక్ కోసం షూటింగ్లో తెలుగులోనే డైలాగులు చెప్పించారు. తెలుగు లాంగ్వేజ్ కష్టంగా అనిపించింది. ఇక నాకు మేకప్ అంటే ఎలర్జీ. నాకు పడదు. ఈ చిత్రంలో మేకప్ లేకుండా కనిపించేందుకు ప్రయత్నించా. యాక్టర్స్గా మనమేంటో తెలియాలి. మేకప్ వేసి లేనిది చూపించడమేం దుకనేది నా భావన. 'డియర్ కామ్రేడ్'లో మేకప్ లేకుండానే నటిస్తున్నా.
ఇంకా చిన్నపిల్లనే..
ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్'తోపాటు తెలుగులో 'దేవదాస్' చిత్రంలో నటిస్తున్నా. కన్నడలో ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. మరో చిత్రానికి చర్చలు జరుగుతున్నాయి. నటనకు ప్రాధాన్యత ఉన్నా పాత్రలే చేస్తాను. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు చేయడం ఇష్టం లేదు. గ్లామర్ పాత్రలు అస్సలు చేయను. ఎందుకంటే నేను గ్లామరస్ పర్సన్ని కాదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలే చేస్తా. నెగటివ్ రోల్స్, పీరియాడికల్ చిత్రాల్లో నటించాలనేది డ్రీమ్. నన్ను దృష్టిలో పెట్టుకుని నెగటివ్ రోల్స్ రాయమని పరుశురామ్కి చెప్పా(నవ్వుతూ). ఏదైనా నా పాత్రకు 100శాతం నా బెస్ట్ ఇస్తా. కెరీర్ పరంగా నేను చిన్నపిల్లని. సినిమా రంగంలోని ఒడిదుడుకుల గురించి మరో ఐదేండ్లు అయితేగానీ చెప్పలేను.
చూసి నవ్వుకున్నా..
నాపై వచ్చే విమర్శలను పాజిటివ్గా తీసుకుంటా. ఎందుకంటే మనం చేసేది అందరికి నచ్చాలనేది లేదు. 5శాతమైనా మన నటనను విమర్శించేవారుంటారు. వారి అభిప్రాయం ముఖ్యం. మనల్ని మనం బెటర్ చేసుకునేందుకు అవే ఉపయోగపడతాయి. అయితే ఇటీవల నా పెళ్ళికి సంబంధించిన వచ్చిన కామెంట్లను చూసి నవ్వుకున్నా. వాటిని పట్టించుకుని సమయం వృథా చేసుకోవడం నాకిష్టం లేదు. మా(రక్షిత్) మధ్య అండర్ స్టాండింగ్ ఉంది. మేం రెండున్నరేండ్లు డేటింగ్ చేయాలనుకున్నాం. సినిమాల వల్ల కాస్త దూరం పెరిగినా కెరీర్ను, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్నా. పెళ్ళి ఎప్పుడనేది ఇంకా ఏం అనుకోలేదు. ఇటీవల మహిళలపై దాడులు జరగడం చూస్తుంటే బాధేస్తుంది. అలా చేసేవారు ముందు తమ ఇంట్లో కూడా మహిళలున్నారనే విషయం ఆలోచించాలి.
మహేష్ ప్రశంసలు..
సినిమాకు ప్రేక్షకుల నుంచే కాదు, సినీ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలందుతున్నాయి. ఇటీవల తరచూ మంచి సినిమాలను అభినం దిస్తున్న మహేష్బాబు తాజాగా 'గీత గోవిందం'ను అభినందించారు. ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ''గీత గోవిందం' విజయం సాధించిం ది. సినిమా చూసి బాగా ఎంజారు చేశా. విజరు దేవరకొండ, రష్మిక మందన్నా అద్భుతంగా నటించారు. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు' అని తెలిపారు. ప్రస్తుతం మహేష్బాబు 'మహార్షి' చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.