Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'యూ టర్న్'. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల విడుదలైన సినిమాకు మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో మంగళవారం సక్సెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ కవిత మాట్లాడుతూ, 'ఇది ఒక అద్భుతమైన చిత్రం. రాంగ్ రూట్లో టర్న్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదమో ఈ సినిమా మంచి సందేశాన్నిచ్చింది. హెల్మెట్ ప్రాధాన్యతను తెలిపింది. సమంత తన పాత్రల ద్వారా చాలా వేరియేషన్స్ చూపిస్తున్నారు. తను పాత్రల కోసం స్ట్రగుల్ పడుతుంది. ఓ వైపు నటిగా, మరోవైపు తెలంగాణ హ్యాండ్లూమ్కు అంబాసిడర్గా, ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా తన సేవ చేస్తున్నారు. సినిమాకు సంగీతం అద్భుతం. విజువల్స్ బాగున్నాయి. దర్శకుడు పవన్ కుమార్కి స్వాగతం. తెలుగులో ఆయన మరిన్ని మంచి సినిమాలు తీయాలి. ఈ సినిమా టైమ్లోనే విడుదలైన నాగచైతన్య సినిమా 'శైలజారెడ్డి అల్లుడు' కూడా విజయం సాధించింది. సమంత, చైతూల మధ్య ఇంట్లో, కెరీర్ పరంగా ఆరోగ్యకరమైన పోటీ ఉంది' అని అన్నారు.
''యూ టర్న్' పూర్తి సంతృప్తినిచ్చింది. క్రిటిక్స్ నుంచి యునానిమస్గా మంచి ప్రశంసలు అందుతున్నాయి. నన్ను నమ్మిన దర్శకుడు, నిర్మాతలకు థ్యాంక్స్. ఈ సినిమా చేశాక లైఫ్లో రాంగ్ టర్న్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నా. మాకు అండగా నిలుస్తున్న కవితకి థ్యాంక్స్' అని సమంత తెలిపారు. దర్శకుడు పవన్ కుమార్ చెబుతూ, 'సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. చిన్నప్పుడు రంగనాయక్ను చూసి ఇందులో ఆయన పాత్ర రాశా. సినిమా బాగా రావడానికి కారణమైన సమంత, ఆది, రాహుల్ రవీంద్రన్, భూమికలకు ధన్యవాదాలు' అని చెప్పారు. 'సమంత, పవన్ కుమార్ లేకపోతే ఈ సినిమా లేదు. సినిమాను పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్కు థ్యాంక్స్' అని నిర్మాతలు తెలిపారు.