Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రణరు పరువు హత్య నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒకరి ప్రాణం తీయటంలో పరువు ఎక్కడ ఉంది?, సమాజం పేరుతో మనం ఎక్కడికి వెళ్తున్నాం' అంటూ ప్రణరు హత్య ఘటనపై కథానాయకుడు రామ్చరణ్ తీవ్ర ఆవేదనని, ఆవేశాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించిన ప్రణరు హత్య ఉదంతంపై సాధారణ ప్రజల దగ్గర్నుంచి సెలబిట్రీల వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దారుణ ఘటన మళ్ళీ పునరావృతం కాకూడదని వేడుకుంటున్నారు. 'ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన ప్రణరును అన్యాయంగా చంపడం దారుణం. అమృతవర్షిణి, ప్రణరు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని రామ్చరణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అలాగే 'ప్రేమకు హద్దులు లేవు', 'ప్రణరుకు న్యాయం జరగాలి' (జస్ట్టీిస్ ఫర్ ప్రణరు) అనే హ్యాష్ట్యాగ్లను కూడా జత చేశారు.