Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఈ మాయ పేరేమిటో' చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో సుకుమార్
ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. బాగుంటే ఏ సినిమాను వదలకుండా చూస్తున్నారు. ఆ కోవలో 'ఈ మాయ పేరేమిటో' కూడా నిలుస్తుంది' అని సుకుమార్ అన్నారు. రాహుల్ విజరు, కావ్య థాపర్ జంటగా రాము కొప్పుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఈ మాయ పేరేమిటో'. వీఎస్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై దివ్య విజరు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, ''జగడం' సినిమాకు విజరు మాస్టర్ పని చేస్తున్నప్పుడు వారింటికి వెళ్ళా. అప్పుడే రాహుల్ని హీరో చేస్తానని అన్నాడు. ఇప్పుడు నిజంగానే హీరోని చేశాడు. రాహుల్ డాన్స్ బాగా చేస్తున్నాడు. అతనిలో జెన్యూన్ ఎమోషన్ ఉంది. నాకు మోటివేషన్ మా నాన్న. అలాగే రాహుల్కి వాళ్ళ నాన్న. దర్శకుడు రాము నా దగ్గర పనిచేయడానికి చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా చేయడానికి సైతం కష్టపడాల్సి వచ్చింది. దర్శకుడికి మొదటి ఛాన్స్ రావడం చాలా కష్టం. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మాస్టర్కు రాము రుణపడి ఉంటాడు. ఈ కథను చెప్పే విధానం చూసి రాముపై నాకు గొప్ప భావన కలిగింది. అంత అద్భుతంగా నెరేట్ చేశాడు. ఈ స్క్రిప్ట్ గురించి మాస్టర్కి ఫోన్ చేసి చెప్పా. వదులుకోకూడదని నిర్మాతగా మారి సినిమాను నిర్మించారు. విజువల్స్, సాంగ్స్ చాలా బాగున్నాయి. కొత్త కథ. కచ్చితంగా ఆకట్టుకుంటుంది' అని అన్నారు.
'క్యూట్ లవ్ స్టోరీ ఇది. సినిమా చూశా. చాలా బాగుంది' అని దర్శకుడు ఎన్.శంకర్ తెలిపారు. విజరు మాస్టర్ చెబుతూ, 'మా పాప, బాబు ఎదుగుదలలో సుకుమార్, త్రివిక్రమ్ గైడెన్స్ ఎంతో ఉంది. ఏడాది క్రితం సుకుమార్ ఫోన్ చేసి ఈ కథకు ఎవరినైనా అడగండి లేదంటే మనమే నిర్మిద్దామన్నారు. సినిమాకు టెక్నికల్గా మంచి టీమ్ కుదిరింది. నైజాంలో రిలీజ్ చేస్తున్న ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ నారంగ్, ఆంధ్రాలో రిలీజ్ చేస్తున్న గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్కి థ్యాంక్స్. సినిమా బాగుంటే చూడండి' అని చెప్పారు.
'ఏడాదిన్నరగా నాన్న(విజరు మాస్టర్), అక్క(దివ్య విజరు) కష్టం ఇది. సినిమా కోసం నాన్న నలుగురిలో చేతులు కట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకురాను. ట్రైలర్లో ముద్దు సీన్లు చూసి విమర్శించారు. మాది 'అర్జున్రెడ్డి', 'ఆర్ ఎక్స్ 100' లాంటి సినిమా కాదు. ముద్దులు ప్రేమను తెలుపుకునే పద్ధతి' అని రాహుల్ విజరు తెలిపారు. 'ఈ సినిమా నాకెంతో స్పెషల్. ఎమోషనల్' అని హీరోయిన్ కావ్యా థాపర్ చెబుతూ గతంలో ఫొటోలు తీసుకోనివ్వనందుకు సినీ ఫొటో జర్నలిస్ట్లకు క్షమాపణ చెప్పారు.