Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో సంజోష్, హర్షిత జంటగా నటించిన చిత్రం 'బేవర్స్'. రమేష్ చెప్పాల దర్శకత్వంలో ఎస్.ఎస్.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పొన్నాల చందు, డా||ఎం.ఎస్. మూర్తి, ఎం.అరవింద్ సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, 'ఈసినిమా కు టైటిల్ 'బేవర్స్' అన్నప్పుడు ఇదేంటీ అనుకున్నా. కానీ ఈ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు, పిల్లల్ని అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారనే కాన్సెప్ట్తో సామాజిక స్పృహతో దర్శకుడు రమేష్ ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సుద్దాల అశోక్ తేజ ప్రాణం పెట్టి రాసిన 'తల్లి తల్లి నా నీవనుకున్నా.. లోకంలో నేనింకా ఏకాకినైనట్టు శూన్యంలో వున్నానమ్మా..' అంటూ సాగే అద్భుతమైన సాంగ్ మంచి హిట్గా నిలిచింది. సునీల్ కశ్యప్ అద్భుతమైన ట్యూన్ అందించారు. నా కెరీర్లో మరో సూపర్ హిట్ చిత్రం చేశాననే తృప్తి ఉంది' అని అన్నారు. ''మీ శ్రేయోభిలాషి' చిత్రానికి రచయితగా ఎంతగా తృప్తి చెందానో ఈ సినిమాను రూపొందిస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువ సంతృప్తి చెందాను. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలోని పాత్ర ఇప్పటి వరకు చేయకపోవడం నా అదృష్టం. ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది' అని దర్శకుడు రమేష్ చెప్పాల తెలిపారు. హీరో సంజోష్ చెబుతూ, 'నటకిరీటి రాజేంద్రప్రసాద్తో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. తండ్రితనయులు కలిసి ఈ సినిమా చూడాలి' అని చెప్పారు. 'రాజీపడకుండా సినిమాను నిర్మించాం. విడుదలైన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఆదరించాలని కోరుతున్నాం' అని నిర్మాతలు తెలిపారు.