Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'అరవింద సమేత'. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందు తున్న చిత్రమిది. పూజా హెగ్డే, ఈషా రెబ్బా కథానాయికలుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన మొదటి పాటకు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా 'పెనివిటి'పై వచ్చే రెండో పాటను బుధవారం విడుదల చేశారు. 'నిద్దరని ఇరిసేసి.. రెప్పల్ని తెరిసాను.. నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను.. ఒంటెద్దు బండెక్కి రారా.. సగిలేటి డొంకల్లో పదిలంగా రారా..' అంటూ భావోద్వేగంతో సాగే ఈ పాట భర్త కోసం ఓ భార్య ఎదురుచూపులను తెలిపేలా ఉంది. తమన్ కొత్త తరహాలో ట్యూన్ను అందించారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను కాల భైరవ ఆలపించారు. ఇది శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటుంది. రాయలసీమ నేపథ్యంలో సినిమా రూపొందు తుంది. ఇందులో రాయలసీమ కుర్రాడిగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. త్వరలో చిత్ర ఆడియోను విడుదల చేయబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.