Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి'. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కిషోర్ కుమార్ దర్శకత్వంలో ఏబీటీ క్రియేషన్స్ పతాకంపై ఎం.శ్రీధర్ రెడ్డి, హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఓ మాస్ సాంగ్ను సారథి స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర లోగోను బుధవారం విడుదల చేశారు.
అతిథి గురునాథ్రెడ్డి మాట్లాడుతూ, 'ప్రస్తుతం హైదరాబాద్లోని సారథి స్టూడియోస్లో శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నాం. ఆ తర్వాత మరో పది రోజులు అమలాపురంలో షూటింగ్ జరుపనున్నాం. ఈ షెడ్యూల్తో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయనున్నాం. లక్ష్మీ రారు ఓ హీరోగా సినిమాను నడిపిస్తున్నారు. దర్శకుడు కిషోర్ సినిమాను చాలా బాగా తీర్చిదిద్దుతున్నారు. కామెడీ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రమిది. నిర్మాతలు రాజీపడకుండా నిర్మిస్తున్నారు. టీమ్ అందరికి మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది' అని అన్నారు.
'పూర్తిస్థాయి కామెడీ చిత్రంగా రూపొందుతుంది. ప్రస్తుతం ఓ మాస్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ పాట సినిమాకు హైలైట్గా నిలుస్తుంది. సంగీత దర్శకుడు హరి అన్ని పాటలను వినసొంపుగా కంపోజ్ చేశారు. 70శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. నాకు మంచి పేరు తెచ్చి పెట్టే చిత్రమవుతుందని ఆశిస్తున్నా' అని రారు లక్ష్మీ తెలిపారు. దర్శకుడు కిషోర్ కుమార్ చెబుతూ, 'నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన రారు లక్ష్మీ, నిర్మాతలకు ధన్యవాదాలు. ప్రేక్షకులను నవ్వించాలని చేసే ప్రయత్నమే ఈ సినిమా. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న మాస్ సాంగ్ 'రింగా..రింగా.. రత్తాలు' సాంగ్ స్థాయిలో పాపులర్ అవుతుంది' అని చెప్పారు. నిర్మాత ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ, 'సినిమా బాగా రావడం కోసం నటీనటులు, టెక్నీషియన్లు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం' అని చెప్పారు.