Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నటుడు మంచు మోహన్బాబుకు మాతృవియోగం కలిగింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్బాబు తల్లి మంచు లక్ష్మమ్మ(85) తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. తల్లి మరణ వార్త విని హైదరాబాద్ నుంచి మోహన్బాబు కుటుంబ సభ్యులు హుటాహుటిన తిరుపతి చేరుకున్నారు. నేడు (శుక్రవారం) ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తన తల్లి మరణంతో మోహన్బాబు, ఆయన పిల్లలు మంచు విష్ణు, మనోజ్, మంచు లక్ష్మి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
'నానమ్మ మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. చాలా మిస్సవుతున్నాం నానమ్మ. ఈ సమయంలో నేను భారతదేశంలో లేకపోవడం బాధ కలిగిస్తోంది. ఇది అనుకోకుండా జరిగింది' అంటూ మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. మంచు లక్ష్మమ్మ మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.