Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్, ఆధ్య ఠాగూర్, అదితి హీరోహీరోయిన్లుగా ప్రణరు దర్శకత్వంలో కార్తికేయ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కార్తికేయ నిర్మిస్తున్న నూతన చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రణరు మాట్లాడుతూ, 'ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ, లైఫ్ స్టోరీ. కొన్ని నిజ జీవితాలను రిఫరెన్స్గా తీసుకుని కథగా రాసుకున్నా. చాలా కొత్తగా ఉంటుంది. నేటి తరానికి బాగా కనెక్ట్ అవుతుంది. నవంబర్ నెలాఖరు నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ను జరుపనున్నాం' అని అన్నారు. 'నేను చాలా కాలంగా ఇండిస్టీలో ఉన్నా. పదికిపైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించా. 'గోల్కొండ హైస్కూల్' అందులో ఒకటి. హీరోగా నటిస్తున్న తొలి సినిమా ఇది. ఈ అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా' అని హీరో సుధీర్ తెలిపారు. కెమెరామెన్ కుషీందర్ చెబుతూ, 'ప్రణరు ఆరు నెలలుగా తెలుసు. మంచి స్నేహితుడు. తన ఐడియాలు డిఫరెంట్గా ఉంటాయి. అర్బన్ లైఫ్లో చాలా సమస్యలున్నాయి. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య అనేక సమస్యలు, సంఘర్షణ ఉంటుంది. వాటిని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుంది. అందరం కలిసి మంచి సినిమా చేస్తున్నామనే నమ్మకం ఉంది. సుధీర్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. హీరోయిన్లకు అభినందనలు' అని చెప్పారు. 'ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. మంచి సినిమా అవుతుంది. కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుంది' అని ఆధ్య తెలిపారు. 'మంచి సినిమా తీయడమే లక్ష్మంగా పనిచేస్తాం. ప్రోత్సహించాలని కోరుకుంటున్నా' అని నిర్మాత కార్తికేయ చెప్పారు.