Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, రాశిఖన్నా, ఐశ్వర్యరాజేష్, ఇసాబెల్లె డి హీరోహీరోయిన్లుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దసరా పండుగని పురస్కరించుకుని గురువారం ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి టి.సుబ్బరామిరెడ్డి క్లాప్ నివ్వగా, నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ, '45ఏండ్లలో 46 సినిమాలు నిర్మించిన రామారావు ఇప్పుడు విజయదశమి రోజున విజయదేవరకొండతో తీసే సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. విజరులో మ్యాజిక్ ఉంది. అతని యాక్టింగ్ స్టయిల్, డైలాగ్ డెలివరీ, అర్థవంతమైన తెలుగు బాగుంటాయి. ఆయన మరింత పెద్ద స్థాయికి ఎదుగుతాడు. అలాగే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. 'క్రియేటివ్ కమర్షియల్లో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన రామారావుకి థ్యాంక్స్. ఈ సినిమా కోసం నేను చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. త్వరలో ఆసక్తికర టైటిల్ను ప్రకటిస్తాం. ముగ్గురు అందమైన హీరోయిన్లతో కలిసి నటించడం ఆనందంగా ఉంది' అని విజరు దేవరకొండ తెలిపారు. రాశిఖన్నా చెబుతూ, 'మంచి కథ, మంచి సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. ఛాన్స్ ఇచ్చిన రామారావుకి థ్యాంక్స్. క్రాంతి మంచి ఇంటెన్స్ స్క్రిప్ట్ రెడీ చేశారు' అని చెప్పారు. దర్శకుడు క్రాంతి మాధవ్ చెబుతూ, 'ఈ బ్యానర్లో గతంలో 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' అనే లవ్ స్టోరీ చేశా. ఇప్పుడు కూడా లవ్ స్టోరీనే. కాకపోతే ఇది కాంటెంపరరీ లవ్ స్టోరీ. విజయ్దేవరకొండతో ఈ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. సినిమా రాకింగ్ అవుతుంది' అని చెప్పారు.