Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'సుబ్రహ్మణ్యపురం'. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈషారెబ్బా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ, 'భక్తి ప్రధానంగా సాగే మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. గ్రాఫిక్స్కు ప్రాధాన్యత ఉంటుంది. నా కెరీర్లో ఈ సినిమా ఓ మైలు రాయిగా నిలుస్తుందని నమ్ముతున్నా' అని అన్నారు. 'దసరా కానుకగా రిలీజ్ చేసిన టీజర్ 24 గంటల్లోనే మిలియన్ డిజిటల్ వ్యూస్ రాబట్టింది. సుమంత్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రమిది. ఆయన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాం. సుదీర్ఘ విరామం తర్వాత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఈ సినిమాలో ఓ గీతాన్ని ఆలపించడం విశేషం. ఆయన పాడిన పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మధుర ఆడియో ద్వారా త్వరలోనే పాటలను విడుదల చేయనున్నాం. సినిమాను నవంబర్లో రిలీజ్ చేస్తున్నాం' అని నిర్మాత బీరం సుధాకర్రెడ్డి తెలిపారు.