Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిత్లీ తుపాను భీభత్సంతో సర్వశ్వం కోల్పోయిన బాధితులకు అల్లు అర్జున్ (బన్నీ) సైతం తన ఆపన్న హస్తాన్ని అందించి తన ఔదార్యాన్ని చాటు కున్నారు. తుపాను భీభత్సంతో అతలాకుతలమైన శ్రీకాకుళం ప్రాంత వాసుల్ని ఆదుకునేందుకు అల్లు అర్జున్ తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను అందించారు. 'ఆపదలో ఉంటే మన తెలుగు రాష్ట్రాలైనా, పొరుగు రాష్ట్రాలైనా బన్నీ స్పందించే తీరు మర్చిపోలేం. వైజాగ్లో వచ్చిన హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం రూ.20లక్షలు అందించారు. ఉత్తరాఖండ్ బాధితులకు పది లక్షలు ఇచ్చారు. అలాగే కేరళ వరద బాధితులకు రూ.25 లక్షలు ఇవ్వడమే కాకుండా వారిలో మనోధైర్యం నింపారు. ఉత్తరాంధ్ర ప్రాంతంపై అల్లు అర్జున్కి మొదట్నుంచి ప్రత్యేకమైన అభిమానం ఉంది. వారిని ఆదుకునేందుకు రూ.25లక్షల ఆర్థిక సహాయం ప్రకటించి తన ఔదార్యం చాటుకున్నారు' అని బన్నీ సన్నిహితులు తెలిపారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, అభిమానులంతా సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అల్లు అర్జున్ చెప్పారు. తిత్లీ తుపాను బాధితులకు 'మా'(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్) సభ్యులు తమ వంతు ఐదు లక్షల రూపాయల సాయాన్ని శనివారం ఉదయం ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.